ఏపీలో విద్యార్థులెప్పుడు చూడని రిజిస్టర్

by  |
ఏపీలో విద్యార్థులెప్పుడు చూడని రిజిస్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా విధానంలో మార్పులు చేస్తూ విద్యార్థుల హాజరు పుస్తకంలో కుల, మత వివరాలను నమోదు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. సామాజిక అసమానతల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది.

ఇక నవంబర్ 2 నుంచి పాఠశాలలు రీఓపెన్ చేసేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా అటెంటెండ్స్ రిజిస్టర్‌లో కేవలం విద్యార్థుల పేర్లు, గార్డియన్, డేట్ ఆఫ్ బర్త్, హాజరు శాతం మాత్రమే దర్శనమివ్వనుంది. దీనికి తోడుగా రెడ్ పెన్ వినియోగం కూడా రిజిస్టర్‌లో కనుమరుగు కానున్నట్లు తెలుస్తోంది. ఒకే తరగతి బాలురు, బాలికలు కో-ఎడ్యుకేషన్ లో పద్ధతి తరగతులు నిర్వహణ చేయనున్నారు. వేరు వేరుగా తరగతులు నిర్వహించే పద్ధతిని కూడా తీసేస్తున్నట్టు తెలుస్తోంది.


Next Story

Most Viewed