ఆ ఎన్నికలకు సై అన్న ఆంధ్రా సర్కార్

by  |
ఆ ఎన్నికలకు సై అన్న ఆంధ్రా సర్కార్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు అధికార ప్రభుత్వం రెడీ అయింది. త్వరలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం రాతపూర్వక అంగీకారం తెలిపింది.

కాగా ఈ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆగిన చోట నుంచే మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ కొనసాగించే దిశగా ఈసీ సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ త్వరలోనే జారీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా… ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాల రద్దుకు గతంలోనే ప్రతిపక్షాలు కోరాయి. మరోసారి ఈ డిమాండ్ ను ముందుకు తీసుకురానున్నాయి విపక్షాలు. దీనిపై న్యాయనిపుణల సూచనల తర్వాత ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

ఏపీ సీఎస్, డీజీపీని అభినందిచిన నిమ్మగడ్డ



Next Story

Most Viewed