టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాలకు గ్రీన్​సిగ్నల్​

by  |
టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాలకు గ్రీన్​సిగ్నల్​
X

దిశ, ఏపీ బ్యూరో: టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్​సిగ్నల్ ​ఇచ్చింది. తిరుపతి సమీపంలోని‌ వడమాలపేట వద్ద 300 ఎకరాల భూమిని గుర్తించారు. బుధవారం తిరుపతి పద్మావతి రెస్ట్​హౌస్​లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కరుణాకర్​రెడ్డి ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఇక్కడ నుంచి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపితే త్వరలో కేబినెట్​ ఆమోదిస్తుందని ఉద్యోగ సంఘాల నేతలకు స్పష్టం చేశారు. తద్వారా ఆరు వేల మంది ఉద్యోగులకు లబ్ది చేకూరుతుందని పేర్కొన్నారు. త్వరలో ఉద్యోగుల హెల్త్​పాలసీకి సంబంధించి క్యాష్​లెస్ ​ట్రీట్ మెంట్ కు ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వెలువడుతుందని చెప్పారు. కాంట్రాక్టు, అవుట్​సోర్సింగ్ లో పనిచేస్తున్న దాదాపు 15 వేల మంది కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ కార్పొరేషన్​లో కలపబోవడం లేదని స్పష్టం చేశారు. టీటీడీ కిందనే వారి సేవలను పరిగణిస్తామని ప్రకటించారు.



Next Story

Most Viewed