ఏపీలో పెన్షనర్లకు జగన్ సర్కార్ తీపికబురు

by  |
ఏపీలో పెన్షనర్లకు జగన్ సర్కార్ తీపికబురు
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రభుత్వ పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. పెన్షనర్లకు 3.14 శాతం మేర డీఏ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ శనివారం ఉత్తర్వులను విడుదల చేసింది. పెంచిన డీఏను 2019 జనవరి 1 నుంచి వర్తింపజేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్త పెంపుతో 33.53 శాతానికి పింఛనుదారుల కరవు భత్యం పెరిగింది. ఈ ఏడాది జూలై నుంచి పెంచిన డీఏతో కలిపి పింఛను సొమ్ము ఇస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే డీఏ బకాయిలను వాయిదాల్లో చెల్లిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.


Next Story

Most Viewed