- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎట్టకేలకు.. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ ఏపీ బ్యూరో : ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కాస్త ఆలస్యంగా అందుతున్నాయి. బడ్జెట్ సెషన్లో శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లు పాస్ కాకపోవడంతో ప్రభుత్వం బిల్లులు పాస్ చేసే వెసులుబాటు లేకపోయింది. దీంతో గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా ద్రవ్య వినిమయ బిల్లుకు మోక్షం కల్పించిన ప్రభుత్వం జీతాలు జమ చేయాలంటూ అధికారులను ఆదేశించింది. అయితే, జమా లెక్కలు పూర్తి కాకపోవడంతో వేతనాలు ఉద్యోగుల చేతికందలేదు. నేటి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు […]</p>

X
దిశ ఏపీ బ్యూరో : ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కాస్త ఆలస్యంగా అందుతున్నాయి. బడ్జెట్ సెషన్లో శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లు పాస్ కాకపోవడంతో ప్రభుత్వం బిల్లులు పాస్ చేసే వెసులుబాటు లేకపోయింది. దీంతో గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా ద్రవ్య వినిమయ బిల్లుకు మోక్షం కల్పించిన ప్రభుత్వం జీతాలు జమ చేయాలంటూ అధికారులను ఆదేశించింది. అయితే, జమా లెక్కలు పూర్తి కాకపోవడంతో వేతనాలు ఉద్యోగుల చేతికందలేదు. నేటి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయి. జూన్ నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. మంగళవారం రాత్రి నుంచి మొదలై బుధవారం రాత్రిలోపు ఉద్యోగుల వేతనాలు యాడ్ కానున్నాయి. ఈ మేరకు ట్రెజరీలకు ఆదేశాలు అందినట్టు సమాచారం.
Next Story






