ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

by  |
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలో గెస్ట్‌హౌస్‌ కోసం 30ఎకరాలను కేటాయిస్తూ గురువారం జీవో జారీ చేసింది. భీమిలి నియోజకవర్గం పరిధిలోని కాపులుప్పాడలో గ్రేహౌండ్స్‌కు చెందిన 300ఎకరాల్లో స్టేట్ గెస్ట్‌హౌస్‌ కోసం 30ఎకరాల్లో నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ప్రతిపాదిత గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం భూ రికార్డులు సిద్ధం చేయాలంటూ విశాఖ కలెక్టర్‌కు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. అత్యవసర ప్రాతిపదికన నిర్మాణం జరపాలంటూ జీవోలో సాధారణ పరిపాలన శాఖ పేర్కొంది.



Next Story

Most Viewed