తెలంగాణపై కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు

by  |
తెలంగాణపై కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు
X

దిశ, ఏపీ బ్యూరో: కృష్ణానదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లేఖ రాసింది. తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తిపై కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేసింది. విద్యుత్ ఉత్పత్తి.. నీటి వినియోగం వంటి వివరాలను లేఖలో తెలియజేసింది. శ్రీశైలం జలాశయంలో విద్యుత్ ఉత్పత్తిపై లేఖలో అభ్యంతరం తెలిపింది. ఉమ్మడి ప్రాజెక్టులపై సాగు, తాగునీటి అవసరాలను పరిగణించి విద్యుత్‌ ఉత్పత్తి చేయాల్సి ఉందని ఏపీ ప్రభుత్వం లేఖలో పేర్కొంది. నీటి పంపకాల్లో తెలంగాణ వాదన పూర్తి అసంబద్ధమని ఏపీ తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా టీఎస్‌ జెన్‌కో చేస్తున్న విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపేసేలా ఆదేశాలివ్వాలని ఏపీ ప్రభుత్వం మరోసారి లేఖలో కోరింది.



Next Story

Most Viewed