మూడ్రోజులకోసారి తరగతులు : విద్యాశాఖ మంత్రి

by  |
మూడ్రోజులకోసారి తరగతులు : విద్యాశాఖ మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో నవంబర్ 2వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. దీంతో విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేసుకోవాలని మంత్రి బుధవారం సూచనలు చేశారు. సరి, బేసి సంఖ్య విధానంలో విద్యార్థులకు తరగతుల నిర్వాహణ జరుపాలని ఆదేశాలు జారీ చేశారు. 1,3,5,7,9 తరగతులకు ఒక రోజు, 2,4,6,8,10 తరగతులకు ఒకరోజు నిర్వహించాలని సూచించారు. 750 మంది కంటే ఎక్కువ మంది ఉన్న స్కూళ్లలో మూడు రోజుకోసారి తరగతులు నిర్వహించాలని అన్నారు.

Next Story