గవర్నర్‌కు ఈసీ నిమ్మగడ్డ రమేశ్ లేఖ

by  |
గవర్నర్‌కు ఈసీ నిమ్మగడ్డ రమేశ్ లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ గవర్నర్‌కు ఈసీ నిమ్మగడ్డ రమేశ్ లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ అనుమతి కోరాలనడం రాజ్యాంగ విరుద్దమని లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 243 కే కింద ఈసీకి స్వయం ప్రతిపత్తి ఉందని ఆయన చెప్పారు. ఐదేండ్లకు ఓ సారి ఎన్నికలు నిర్వహించడం ఈసీ విధి అని తెలిపారు. ప్రభుత్వ అనుమతితో ఎన్నికలు జరపాలన్న ఆర్డినెన్స్ ను తిరస్కరించాలని గవర్నర్ ను కోరారు. అవసరమైతే సుప్రీం కోర్టు న్యాయ నిపుణులను సంప్రదించాలని గవర్నర్ కు ఆయన విజ్ఞప్తి చేశారు.


Next Story

Most Viewed