మీ అమ్మతనానికి మేం చలించిపోయాం: ఏపీ డీజీపీ

by  |
మీ అమ్మతనానికి మేం చలించిపోయాం: ఏపీ డీజీపీ
X

తూర్పుగోదావరి జిల్లాలోని తుని పట్టణంలో మండుటెండలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు శీతలపానియాలు అందించిన మహిలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ప్రముఖ సినీ నటుడు ఆర్.మాధవన్, రవీనా టాండన్ తదితరులు దీనిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ఆమె వివరాలు తెలుసుకుని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమెతో నేరుగా మాట్లాడి కృతజ్ఞతలు తెలిపారు.

మీ అమ్మతనానికి మేమంతా చలించిపోయామని అన్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై మీరు చూపిన ప్రేమకు మేమంతా సెల్యూట్ చేస్తున్నామని ధన్యవాదాలు తెలిపారు.

tags: ap dgp, gautam sawang, video conference, thanks to the lady, viral video

Next Story