వైద్య పరీక్షల అనంతరమే..

by  |
వైద్య పరీక్షల అనంతరమే..
X

చెక్ పోస్టుల వద్ద వేచి ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రాష్ట్రంలోకి అనుమతించాలనే ఒప్పందం చేసుకున్నట్టు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. దాచెపల్లి చెక్ పోస్టు వద్ద జరిగిన సంఘటన దురదృష్టమన్నారు. రాష్ట్రంలోకి అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అన్ని రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయని, ఆదేశాలు ఉల్లంఘించి దాటే ప్రయత్నం చేయొద్దని కోరారు. దేశమంతా మెడికల్ ఎమర్జెన్సి కొనసాగుతోందని తెలిపారు. ఈ సమయంలో బాధ్యత గల పౌరునిగా ఉండాలని అన్నారు. దేశం, కుటుంబం కోసం స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు.

Tags: After medical examination,Permission to State,AP DGP Gautam Sawang,should in self isolation

Next Story

Most Viewed