హైకోర్టు ముందు హాజరైన ఏపీ డీజీపీ

by  |
హైకోర్టు ముందు హాజరైన ఏపీ డీజీపీ
X

దిశ, ఏపీ బ్యూరో: హైకోర్టు ముందు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ హాజరయ్యారు. అక్రమ మద్యం తరలింపు వ్యవహారంలో పట్టుబడిన వాహనాల అప్పగింతలో పోలీసులు తీవ్ర జాప్యం చేస్తున్నారన్న పిటిషన్‌పై విచారించిన హైకోర్టు పోలీసులను వివరణ కోరింది. అయితే వారు సరైన వివరణ ఇవ్వలేకపోవడంతో డీజీపీ హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఆయన నేడు హైకోర్టు ముందు హాజరయ్యారు.

కాగా, ఏపీ డీజీపీ హైకోర్టు ముందు హాజరు కావడం ఇదో మూడోసారి. గతంలో ఓ దంపతులకు సంబంధించి హెబియస్‌కార్పస్ పిటిషన్ నేపథ్యంలో హైకోర్టు ముందు స్వయంగా హాజరు కావాల్సి వచ్చింది. మరోసారి విశాఖపట్టణంలో టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా స్థానిక పోలీసులు ఆయనకు నోటీసు ఇవ్వడంపై డీజీపీని వివరణ కోరింది. దీంతో ఆయన మరోసారి హాజరుకావాల్సి వచ్చింది.

Next Story