శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం

by  |
శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… శ్రీవారి పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి అపారమైన భక్తి కలిగి ఉన్నారని చెప్పారు. జగన్‌కు వ్యక్తులపై నమ్మకం కంటే.. ప్రజలంటే నమ్మకం ఎక్కువని.. ప్రజలు దేవుళ్లుగా భావించే వ్యక్తి సీఎం జగన్ అని తెలిపారు. డిక్లరేషన్‌పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాకుండా జగన్ నాడు పాదయాత్ర ప్రారంభం ముందు, ముగిసిన తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారని గుర్తు చేశారు. పీఠాధిపతులు అందరూ సీఎం జగన్‌ను ఆశీర్వదించారని వెల్లడించారు

Next Story

Most Viewed