బురద జల్లే ప్రయత్నం మానుకోవాలి: అంజద్ పాషా

by  |
బురద జల్లే ప్రయత్నం మానుకోవాలి: అంజద్ పాషా
X

దిశ,వెబ్‌డెస్క్: టీడీపీ నేత సుబ్బయ్య హత్య విషయంలో చంద్రబాబు,లోకేశ్‌లు వైసీపీపై బురద జల్లుతున్నారని ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. హత్యా రాజకీయాలను జగన్ ప్రొత్సహిస్తున్నారని విమర్శించడం తగదన్నారు. ఎమ్మెల్యే ప్రసాద రెడ్డి, బావమరిది అవినీతిపై మాట్లాడితే హత్య చేశారనడం అబద్దమని తెలిపారు. హత్యకు గురైన సుబ్బయ్యపై గతంలో అనేక కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. హత్యకు పాల్పడింది ఎవరైనా లోతుగా విచారణ జరిపి శిక్ష పడేలా చూస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై బురద జల్లే ప్రచారం మానుకోవాలని కోరారు.

Next Story

Most Viewed