- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని పదవీకాలం మరో మూడు నెలలు పొడిగించాలంటూ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించింది. దీంతో ఆమె మరో మూడు నెలల పాటు ఏపీ సీఎస్గా కొనసాగనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రానికి కొత్త వ్యక్తి సీఎస్గా వస్తే సమస్యలు మరింత తీవ్రమవుతాయని, ఈ నేపథ్యంలో ప్రస్తుత సీఎస్ పదవీకాలం పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఆమె పదవీ కాలాన్ని మరో మూడు నెలలు అంటే ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఆమె పదవీ కాలం జూన్ 30తో ముగియాల్సి ఉంది.
Next Story