ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

by  |
AP corona Update
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో గత కొన్నిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. వారం రోజుల క్రితం 2వేల లోపు నమోదైన కేసులు ఇప్పుడు పెరుగుతుండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 84,858 శాంపిల్స్ పరీక్షించగా 2,252 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది. తాజా కేసులతో కలిసి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,54,765కు చేరింది.

నిన్న ఒక్కరోజే కరోనా వల్ల 15 మంది మరణించారు. దీంతో మెుత్తం మరణాల సంఖ్య 13,256కు చేరింది. అదే సమయంలో 2,252 మంది కొవిడ్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 19,19,354కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,155 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,40,50,103 సాంపిల్స్‌ని పరీక్షించినట్లు వైద్యఆరోగ్య శాఖ తెలిపింది.


Next Story

Most Viewed