ఏపీలో ఒక్కరోజే 9,393కేసులు

by  |
coronavirus
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలింత ఆశించినంత మేర కనిపించడం లేదు. తాజాగా గడచిన 24 గంటల్లో 9,393పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,25,396కు చేరింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 87,177యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకు 2,35,218 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా మరో 95 మంది కరోనా బారిన పడి మృతి చెందగా, ఏపీలో ఇప్పటివరకు 3,001 కరోనా మరణాలు సంభవించాయి.



Next Story

Most Viewed