నేడు ఢిల్లీకి సీఎం జగన్

by  |
నేడు ఢిల్లీకి సీఎం జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మంగళవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్‌ని కలిసి, వారితో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రత్యేక హోదా, పోలవరం బకాయిలతో సహా పలు అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. ఢిల్లీ వెళ్లనున్న నేపధ్యంలో ఈ ఉదయం ఆర్థిక శాఖ అధికారులతో ఆయన సమీక్ష చేయనున్నారు.

Next Story