కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం జగన్​ భేటీ

by  |
కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం జగన్​ భేటీ
X

దిశ, ఏపీ బ్యూరో: కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాల ఆమోదంపై చర్చించిన సీఎం, ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం, పునరావసంపై ఖర్చు చేసిన నిధులను త్వరితగతిన విడుదల చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్ట్‌తో పాటు మిగతా నదులన్నింటినీ అనుసంధానం చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కేందమంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పదించినట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed