అమిత్‌ షాతో ముగిసిన సీఎం జగన్‌ భేటీ

by  |
అమిత్‌ షాతో ముగిసిన సీఎం జగన్‌ భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో ఏపీ సీఎం జగన్‌ భేటీ ముగిసింది. రాత్రి 8.30గంటలకు మొదలైన సమావేశం 9.45 వరకు కొనసాగింది. గంటకు పైగా సాగిన సమావేశంలో ఇరువరి మధ్య రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక విషయాలు చర్చకు వచ్చాయి. తుపాన్ సాయంతో పాటు పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల మేరకు నిధులు విడుదల చేయాలని కోరినట్లు తెలుస్తోంది. ఇవాళ రాత్రికి ఢిల్లీలోనే ఉండనున్న సీఎం జగన్.. రేపు ప్రధాని మోడీతో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Next Story

Most Viewed