మానుకోటలో ఏపీ సీఎం జగన్ దిష్టిబొమ్మ దగ్దం

by  |
మానుకోటలో ఏపీ సీఎం జగన్ దిష్టిబొమ్మ దగ్దం
X

దిశ, మహబూబాబాద్: ఏపీలోని మంగళగిరి టీడీపీ పార్టీ కార్యాలయంపై, పార్టీ శ్రేణులపై వైసీపీ నేతల దాడులను నిరసిస్తూ.. బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు రామచందర్ రావు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల పంపిణీ పై మాట్లాడిన టీడీపీ నేతల ఇంటిపై దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. జగన్ పాలనలో ప్రజాస్వామ్యం ఖునీ అవుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సునీత మంగిలాల్, ప్రేమ్ చంద్, హరికిషన్, రామ్ రెడ్డి, ఎల్లయ్య, బాలు, బద్రు పాల్గొన్నారు.


Next Story

Most Viewed