జగన్ ఢిల్లీ టూర్: షెడ్యూల్ ఇదే

by  |
జగన్ ఢిల్లీ టూర్: షెడ్యూల్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10.30 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1.40 గంటల కల్లా జగన్ ఢిల్లీ చేరుకోనున్నారు. రాత్రి 9 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశం కానున్నారు. ఈ మేరకు అమిత్ షా అపాయింట్‌మెంట్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. హోంమంత్రితో భేటీ ఆధారంగా మిగిలిన కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలిసే అవకాశం ఉంది.

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్​, పెట్రోలియం, ఉక్కుశాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రైల్వే, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌ను కలిసేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం. సీఎం వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్ కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, వ్యాక్సిన్ పంపిణీ, ఇతర అంశాలపై కేంద్రమంత్రులతో జగన్ చర్చించే అవకాశముంది. అనంతరం ఈ రాత్రికి ఢిల్లీలోని అధికారిక నివాసంలో బస చేయనున్న జగన్… రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి విజయవాడ రానున్నారు.

Next Story

Most Viewed