ఏపీ సీఎం కు దావోస్ నుంచి ఆహ్వానం..

by  |
ఏపీ సీఎం కు దావోస్ నుంచి ఆహ్వానం..
X

దిశ, వెబ్ డెస్క్ : దావోస్ లో నిర్వహించే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ నుంచి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆహ్వానం అందింది. 2020 జనవరి 17 నుంచి 21 వరకు ఈ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా డబ్ల్యూఈఎఫ్ ప్రతినిధి బోర్జ్ బ్రెండ్ ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని కలిశారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థికాభివృద్ది కోసం ఏఏ చర్యలు తీసుకుంటుందో గౌతమ్ రెడ్డి ఆయనకు వివరించారు. ఈ ఏడాది ‘వర్కింగ్ టుగెదర్, రీస్టోరింగ్ ట్రస్ట్’ పై సమావేశం ఏర్పాటు చేసినట్టు బోర్జ్ తెలిపారు.

కరోనా సమయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను బోర్జ్ ప్రశంసించారు. అంతే కాకుండా ఎకనామిక్ డెవలెప్ మెంట్, పారిశ్రామిక విధానం, అభివృద్ది, ఇలా చాలా అంశాలను తెలుసుకున్నారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ఇతర కార్యక్రమాలను బోర్జ్ బ్రెండ్ అభినందించారు.


Next Story

Most Viewed