ఈ నెల 29న ఏపీ కేబినెట్ భేటీ

by  |
ఈ నెల 29న ఏపీ కేబినెట్ భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 29న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఆ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఈ భేటీ జరగనుండగా.. సెకండ్ వేవ్ ప్రతాపం చూపిస్తున్న తరుణంలో జరగనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్, రోగులకు అందుతున్న వైద్యసాయంపై చర్చించనుంది.

ఆక్సిజన్ సరఫరా, బెడ్స్, రెమిడిసివిర్ కొరత వంటి అంశాలపై కేబినెట్‌లో చర్చ జరగనుంది. వీటితో పాటు వీకెండ్ లాక్‌డౌన్ లాంటి అంశాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇప్పటికే పలు జిల్లాల్లో మినీ లాక్‌డౌన్‌ను అధికారులు అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

Next Story