ఈ నెల 15న ఏపీ కేబినెట్ భేటీ

by  |
ఈ నెల 15న ఏపీ కేబినెట్ భేటీ
X

దిశ ఏపీ బ్యూరో: ఈ నెల 15న కేబినెట్ భేటీ జరగనుంది. అమరావతిలోని వెలగపూడిలో గల సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో కరోనా నియంత్రణతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరుగనుంది. గత నెల 11న జరిగిన‌ కేబినెట్ భేటీలో ‘వైఎస్సార్‌ చేయూత’, ‘జగనన్న తోడు’, ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ’, ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్’, ‘ఇళ్ల పట్టాలు’, ‘గృహనిర్మాణ మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులు’, గుంటూరు, శ్రీకాకుళం, మచిలీపట్నంలో నర్సింగ్ కాలేజీల్లో 282 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సారి ప్రభుత్వం చేపట్టనున్న వివిధ పనులకు ఆమోదం తెలిపేందుకు కేబినెట్ సమావేశం జరుగనుంది.

Next Story