ఏపీలో విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే

by  |
AP Cabinet Meeting Today
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ వెటర్నరీ అంబులెన్స్‌ల కొనుగోలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే అమ్మఒడి పథకంలో భాగంగా 9 నుంచి 12 వతరగతి విద్యార్ధులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అలాగే ఒంగోలు శివారులో ఆంధ్రకేసరి వర్సిటీ ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతోపాటు విజయనగరం జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాలను వర్సిటీగా మార్పుకు ఆమోదం. జేఎన్ టీయూ చట్టం 2008 సవరణకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది.

కేబినెట్ నిర్ణయాలు..

1. టిడ్కో ద్వారా 2,62,216 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు ఆమోదం.
మౌలిక సదుపాయల కల్పనకు రూ.5990 కోట్ల మేర బ్యాంకు రుణం హామీకి ఆమోదం.
2. 2021-24 ఐటీ విధానానికి ఆమోదం.
3. కాకినాడ పోర్టులో రీ గాసిఫికేషన్ టెర్మినల్ ఏర్పాటుపై చర్చ.
4. మారిటైమ్ బోర్డుతో సంయుక్త కార్యకలాపాల నిర్వహణకు అనుమతి.
5. రీసర్వే పట్టాదారులకు ధ్రువపత్రాల జారీకి భూహక్కు చట్ట సవరణకు ఆమోదం.
6. విశాఖ నక్కపల్లి వద్ద హెటిరో డ్రగ్స్ భూ కేటాయింపునకు ఆమోదం. 81 ఎకరాల భూ కేటాయింపుకు అంగీకారం తెలిపిన మంత్రివర్గం .
7. పుట్టపర్తి నియోజకవర్గానికి రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు కింద నీటి సరఫరా.
తొలిదశ కింద ఎత్తిపోతల ,గ్రావిటీ ద్వారా నీటి సరఫరాకు అంగీకారం.
8. రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్ సీలకు 539 కొత్త 104 వాహనాల కొనుగోలుకు ఆమోదం.
9. విజయవాడలో గుణదలలో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే నవరత్నాల్లో భాగంగా 28లక్షల ఇళ్ల నిర్మాణానికి సంబంధిం భారీ ప్రచార కార్యక్రమానికి కేబినెట్ ఆమోద తెలిపింది.



Next Story

Most Viewed