ఏపీ వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్.. భారీగా ఉద్యోగాలు

by  |
ఏపీ వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్.. భారీగా ఉద్యోగాలు
X

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో ఏపీలో కేబినెట్ మీటింగ్ జరిగింది. తాడేపల్లిలోని సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో దాదాపు 11 అంశాలపై మంత్రివర్గం చర్చించింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైతులకు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్‌ అందించేందుకు సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో ఒప్పందానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సినిమాటోగ్రఫీ చట్టసవరణ ప్రతిపాదనలకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది. 2021 జనాభా గణనలో బీసీ జనాభాను కులాల వారీగా గణించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అలాగే అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు కొత్తగా జైన్‌ కార్పొరేషన్‌, సిక్కు కార్పొరేషన్‌ ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. వైద్య, ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed