- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో బీజేపీ నేతల బృందం మంగళవారం ఢిల్లీ వెళ్లనుంది. ఈ బృందం ఢిల్లీలో మూడు రోజుల పాటు పర్యటించనుంది. కేంద్రమంత్రులతోపాటు పార్టీ కీలక నేతలతో కూడా సమావేశం కానున్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఫిర్యాదు చేయనున్నారు. అలాగే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ను కూడా కలవనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిధులు, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు.
మరోవైపు కేంద్ర రైల్వే శాఖమంత్రి అశ్వని వైష్ణవితో కూడా భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై మంతనాలు జరపనున్నారు. అలాగే ఆర్బీఐ అధికారులతో కూడా సమావేశమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, తదితర ఆర్థిక లావాదేవీలపై ఆర్బీఐకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. చివరిగా బీజేపీ అగ్రనేతలతో సమావేశం కానున్నట్లు సమాచారం. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్టుగా తెలుస్తోంది.