టిప్పు సుల్తాన్ దుర్మార్గుడు.. అబ్దుల్ కలాం విగ్రహం పెట్టండి

by  |
టిప్పు సుల్తాన్ దుర్మార్గుడు.. అబ్దుల్ కలాం విగ్రహం పెట్టండి
X

దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు వివాదం రేపుతోంది. దీనిపై ఏపీ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీర్రాజు స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటుచేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, భారతీయులను కాఫీరులుగా ముద్ర వేసి ఊచకోత కోసిన పరమ దుర్మార్గుడికి విగ్రహాం ఏర్పాటు చేయడం ఏంటని సోము వీర్రాజు మండిపడ్డారు.

విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వల్ల హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్లే అని ఆయన విరుచుకుపడ్డారు. ప్రొద్దుటూరు మత సామరస్యానికి మారుపేరుగా ఉందని, ప్రశాంతంగా ఉన్న పట్టణంలో ఏర్పాటు చేయడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. టిప్పుసుల్తాన్ క్రూరుడు కాబట్టే గతంలో ఎక్కడా విగ్రహాలు పెట్టలేదని, దేశానికి ఎనలేని సేవ చేసిన మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త అబ్దుల్ కలాం కన్నా టిప్పు సుల్తాన్ గొప్పవాడు కాదని, టిప్పుసుల్తాన్ విగ్రహం స్థానంలో కలాం విగ్రహం ఏర్పాటు చేయాలని సోము వీర్రాజు సూచించారు.



Next Story

Most Viewed