పండుగలపై ఓటు బ్యాంకు రాజకీయాలొద్దు

by  |
పండుగలపై ఓటు బ్యాంకు రాజకీయాలొద్దు
X

దిశ, ఏపీ బ్యూరో చీఫ్, విజయవాడ: వినాయక చవితి పండుగకు ప్రభుత్వం ఆటంకాలు కలిగించవద్దని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి కోరారు. వినాయక చవితి అన్ని వర్గాల ప్రజలను కలిపి సామాజిక చైతన్యాన్ని కలిగించేదన్నారు.

పండుగలు, ప్రజలను ప్రభుత్వం ఓటు బ్యాంకుగా చూడకూడదన్నారు. రంజాన్ మాసంలో ప్రభుత్వం ఏవిధంగా చర్యలు తీసుకుందో అలానే ఇప్పుడు కూడా తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో తక్షణం హిందూ మత పెద్దలు, స్వామీజీలు, మఠాధిపతులతో ప్రభుత్వం చర్చించాలని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు.

Next Story

Most Viewed