ఎండోమెంట్ నిధులు అమ్మ ఒడికి మళ్లిస్తారా? : కన్నా

by  |
ఎండోమెంట్ నిధులు అమ్మ ఒడికి మళ్లిస్తారా? : కన్నా
X

దిశ, ఏపీబ్యూరో :
అమ్మఒడి పథకం కోసం ఎండోమెంట్ నిధులు కేటాయించడం దారుణమని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మండిపడ్డారు. ఇలాంటి చర్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. దేవాదాయశాఖ నిధులను కేవలం హిందు ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో దేవాదాయశాఖ నిధులు ఇతర కార్యక్రమాలకు మళ్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికే అమ్మఒడి పథకానికి మళ్లించిన నిధులను వెంటనే దేవాదాయశాఖ అకౌంట్లో యాడ్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ సీఎం జగన్‌కు ఒక లేఖ రాశారు.



Next Story

Most Viewed