ఈనెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు..

by  |
ఈనెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ శాసనసభ సమావేశాలు ఈనెల 30 నుంచి ప్రారంభం కానున్నాయి.అందుకు సంబంధించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్రన్ గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. 30వ తేదీ ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాగా, ఈ సమావేశాలు ఐదు రోజుల పాటు కొనసాగుతాయని నోటిఫికేషన్ వెల్లడించింది.

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈనెల 30వ తేదీన బీఏసీ సమావేశం ఉండనుంది. పనిదినాలు, అసెంబ్లీ సమావేశాల అజెండాను ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం ఖరారు చేయనున్నారు.



Next Story