ఏపీ, తమిళనాడు మధ్య బస్సుల పంచాయితీ..

by  |
ఏపీ, తమిళనాడు మధ్య బస్సుల పంచాయితీ..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ, తమిళనాడు రాష్ట్రాల మధ్య బస్సుల పంచాయితీ నడుస్తోంది. పర్మిట్లు, రికార్డులు సరిగా లేవనే కారణాలతో పోటీపడి ఏపీ బస్సులను తమిళనాడు, ఆ రాష్ట్ర బస్సులను ఏపీ ఆర్టీఏ అధికారులు సీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడులోని వేలూరులో చిత్తూరు జిల్లాకు చెందిన మూడు బస్సులను అక్కడి ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు.

ఫలితంగా తమిళనాడు నుంచి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించిన ఆర్టీసీ బస్సులను ఏపీ అధికారులు సీజ్ చేశారు. వాటి సంఖ్య మొత్తం 10 వరకు ఉంటుంది. చిత్తూరు జిల్లా కుప్పంలోనూ తమిళనాడుకు చెందిన మరో 10బస్సులను సీజ్ చేశారు. తమిళనాడులోని కృష్ణగిరిలో ఏపీకి చెందిన ఐదు బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు.

Next Story

Most Viewed