లంచం ఇవ్వాలని ఏవో బెదిరింపులు : ఫోన్‌ కాల్ సంభాషణ వైరల్!

by  |
bribe-ao
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : లంచం తీసుకుంటూ నెక్కొండ అగ్రికల్చర్ ఆఫీసర్ (AO) సంపత్ రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డాడు. డబ్బుల కోసం ఆయన అప్పాల్రావుపేట గ్రామానికి చెందిన వడ్డే ఏకాంబరాన్ని బెదిరిస్తున్న ఫోన్ కాల్ సంభాషణ లీకైంది. ప్రస్తుతం ఈ ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏకాంబ‌రానికి చెందిన ఫెర్టిలైజర్ షాపులో త‌నిఖీలు చేప‌ట్టకుండా ఉండేందుకు ఏవో సంపత్ రెడ్డి రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు.

అడిగినంత ఇవ్వకపోతే నీ ఇజ్జత్ తీస్తానని.. త‌న‌కు పై అధికారుల నుంచి ప్రెజ‌ర్ ఉంద‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ఈ వ్యవహారంలో ఏడీ శ్రీనివాసరావు ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నట్లుగా స్పష్టమ‌వుతుండ‌గా ఏసీబీ అధికారులు ఆయ‌న్ను విచారించేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. అయితే, రెండు రోజులుగా స‌ద‌రు అధికారి అజ్ఞాతంలో ఉండ‌టం చ‌ర్చనీయాంశంగా మారింది.



Next Story

Most Viewed