శ్రీవారి ఆలయం ఎదుట భక్తుల ఆందోళన

by  |
శ్రీవారి ఆలయం ఎదుట భక్తుల ఆందోళన
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట భక్తులు ఆందోళనకు దిగారు. శ్రీవాణి ట్రస్ట్ దర్శనాల్లో బంగారు వాకిలి నుంచే తమను వెనక్కి పంపేశారని.. లఘు దర్శనానికి అనుమతించలేదని ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో భక్తులు, అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రూ.10 వేలు విరాళమిచ్చి దర్శనానికి వస్తే ఆలయ సిబ్బంది తమను తోసేశారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమతో అధికారులు దురుసుగా ప్రవర్తించారని భక్తుల ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed