పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు తీపి కబురు చెప్పిన జేజమ్మ

by  |
పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు తీపి కబురు చెప్పిన జేజమ్మ
X

దిశ, సినిమా : సౌత్ ఇండస్ర్టీలో హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకున్న అనుష్క శెట్టి.. నేడు 40వ పడిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తన అప్‌డేట్ మూవీపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టింది. అసలు విషయానికొస్తే.. కొంతకాలంగా స్వీటీ లేటెస్ట్ ప్రాజెక్ట్‌పై అనేక రకాల రూమర్స్ పుట్టుకొచ్చాయి. ‘అనుష్క ఇకపై సినిమాల్లో నటించదు, ఆమె పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిల్‌ అయ్యేందుకు నిర్ణయించుకుంది. అందుకే యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో చేయాల్సిన సినిమా నుంచి తప్పుకుంది’ అంటూ పుకార్లు వ్యాపించాయి. అయితే ఇప్పటిదాకా ఈ వార్తలపై స్పందించని జేజమ్మ.. బర్త్‌డే సందర్భంగా ఆగిపోయిందనుకున్న మూవీని అధికారికంగా ప్రకటించి రూమర్స్‌కు చెక్ పెట్టింది.

ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కు మహేశ్‌బాబు. పి దర్శకత్వం వహిస్తుండగా.. అనుష్కకు ఇది 48వ చిత్రం కానుంది. ఇక ఆమె నటించిన ‘మిర్చి, భాగమతి’ సినిమాలు కూడా ఇదే బ్యానర్‌‌లో రూపొందగా, లేటెస్ట్ మూవీతో హ్యాట్రిక్‌ కొట్టనుంది స్వీటీ. కాగా ఈ చిత్రం కూడా లేడీ ఓరియెంటెడ్ కథాంశంతోనే తెరకెక్కనుందని సమాచారం.

‘సెక్స్’ శారీరక అవసరం కాదు.. టీనేజర్స్‌ మైండ్ సెట్‌పై ఓపెన్ టాక్!


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed