మహారాష్ట్రలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న డ్రగ్స్ కేసు.. వీడియో

by Vadlamudi Anukaran |   (  Updated:2021-10-09 04:40:56  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : ముంబైలో డ్రగ్స్ కేసు రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసుపై మహారాష్ట్ర మంత్రి నవాబ్​మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో అరెస్టైన వారిలో ముగ్గురిని ఓ భాజపా నాయకుడి ప్రోద్బలంతో ఎన్​సీబీ అధికారులు విడుదల చేశారని చెప్పారు. క్రూయిజ్‌ షిప్‌పై దాడి అనంతరం 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తొలుత ఎన్​సీబీ అధికారులు వెల్లడించారని నవాబ్ మాలిక్​ గుర్తుచేశారు. కానీ, వారిలో 8 మందిని మాత్రమే [&hellip;]</p>

మహారాష్ట్రలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న డ్రగ్స్ కేసు.. వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్ : ముంబైలో డ్రగ్స్ కేసు రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసుపై మహారాష్ట్ర మంత్రి నవాబ్​మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో అరెస్టైన వారిలో ముగ్గురిని ఓ భాజపా నాయకుడి ప్రోద్బలంతో ఎన్​సీబీ అధికారులు విడుదల చేశారని చెప్పారు. క్రూయిజ్‌ షిప్‌పై దాడి అనంతరం 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తొలుత ఎన్​సీబీ అధికారులు వెల్లడించారని నవాబ్ మాలిక్​ గుర్తుచేశారు.

కానీ, వారిలో 8 మందిని మాత్రమే అరెస్టు చేశారని ఆరోపించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రిషభ్‌ సత్యదేవ్, ప్రతిక్‌ గాబా, అమిర్‌ ఫర్నిచర్‌వాలాను ఓ బీజేపీ నేత తప్పించారని పేర్కొన్నారు. ఆయన జోక్యం అనంతరం వారిని ఎన్‌సీబీ అధికారులు విడుదల చేశారని మంత్రి ఆరోపించారు. ఈ మేరకు కొన్ని వీడియోలను మంత్రి విడుదల చేశారు. ఎవరి ఆదేశాల మేరకు ఆ ముగ్గురిని డ్రగ్స్‌ కేసు నుంచి తప్పించారో ఎన్‌సీబీ తెలపాలని మంత్రి డిమాండ్‌ చేశారు. ఈ విషయమై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రేకు లేఖ కూడా రాసినట్లు పేర్కొన్నారు.

Next Story