రంగారెడ్డి జిల్లాలో మహిళకు కరోనా

by  |
రంగారెడ్డి జిల్లాలో మహిళకు కరోనా
X

దిశ, షాద్ నగర్: షాద్‌నగర్ నియోజకవర్గంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కేశంపేట మండలం వేములనర్వ గ్రామానికి చెందిన ఓ మహిళకు కరోనా సోకింది. శ్వాసకోస సమస్యతో సదరు మహిళ షాద్‌నగర్ పట్టణంలోని ఓ ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. తీర నిమ్స్‌కు వెళితే గాంధీ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. దీంతో అక్కడ కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్య అధికారులు తెలిపారు. దీంతో కేశంపేట మండలంలో తొలి కరోనా కేసు నమోదైంది.

Next Story

Most Viewed