ఖమ్మం జిల్లాలో మరో రెండు పాజిటివ్ కేసులు

by  |
ఖమ్మం జిల్లాలో మరో రెండు పాజిటివ్ కేసులు
X

దిశ, ఖమ్మం: జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా మరో రెండు కేసులు వెలుగులోకి వచ్చాయి. మధిర పట్టణానికి చెందిన ఓ వృద్ధుడు కరోనాతో ఇటీవల చనిపోయాడు. తాజాగా అతని చిన్న కుమారుడికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. మరో కేసు నేలకొండపల్లిలో నమోదైంది. పట్టణానికి చెందిన సిమెంట్, పైపుల వ్యాపారికి కోరోనా సోకినట్లు సమాచారం. ఈ వ్యాపారి తరుచూ వ్యాపారం నిమిత్తం సూర్యాపేటకు వచ్చివెళ్తున్నట్టు సమాచారం.

Next Story

Most Viewed