తెలంగాణలో 18కి చేరిన పాజిటివ్ కేసులు

by Shyam |   (  Updated:2020-03-20 04:32:53  IST  )

<p>మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దీంతో రాష్ట్రంలో 18కి కరోనా పాజిటివ్ కేసులు చేరాయన్నారు. అయితే, ఈ 18 కేసుల్లో ఎవరికీ ప్రాణాపాయం లేదని మంత్రి స్పష్టం చేశారు.  విదేశాల నుంచి వచ్చిన వారికే ఈ వైరస్ సోకిందని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రజలకు కరోనా రాలేదని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వేల మందిని క్వారంటైన్ చేయగలిగేలా సన్నద్ధం అయ్యామని మంత్రి వెల్లడించారు. బాధితులు [&hellip;]</p>

తెలంగాణలో 18కి చేరిన పాజిటివ్ కేసులు
X

మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దీంతో రాష్ట్రంలో 18కి కరోనా పాజిటివ్ కేసులు చేరాయన్నారు. అయితే, ఈ 18 కేసుల్లో ఎవరికీ ప్రాణాపాయం లేదని మంత్రి స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారికే ఈ వైరస్ సోకిందని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రజలకు కరోనా రాలేదని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వేల మందిని క్వారంటైన్ చేయగలిగేలా సన్నద్ధం అయ్యామని మంత్రి వెల్లడించారు. బాధితులు పెరిగితే ఏం చేయాలో ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నామన్నారు. అయితే, అధిక ఉష్ణోగ్రతలో వైరస్ బతకదని నిపుణులు చెబుతున్నారని ఈటల మరోసారి గుర్తు చేశారు.

Tags: etela rajendar, carona, another, positive case, telangana

Next Story