సుశాంత్ సింగ్ కేసులో మరో ట్విస్ట్

by  |
సుశాంత్ సింగ్ కేసులో మరో ట్విస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తీరుగుతుంది. బాలీవుడ్‌ రంగంలో బంధుప్రీతి, అగ్రహీరోలు, నిర్మాతల ఒత్తిడి పెరిగే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని సోషల్ మీడియాలో వినిపిస్తున్న వాదన. అయితే, ఇదే కేసులో మరో ట్విస్ట్ జరిగింది. సుశాంత్ తండ్రి కేకే సింగ్ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.

సుశాంత్ రాజ్ పుత్ స్నేహితురాలు అయినా.. రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులపై కేకే సింగ్ పట్నా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు మరో మలుపు తిరిగింది. ఇప్పటికే ముంబై పోలీసులు పలు బాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు పంపి విచారిస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ సమయంలో సుశాంత్ తండ్రి ఫిర్యాదు సంచలనంగా మారింది. సుశాంత్ నుంచి డబ్బులు తీసుకున్న రియా, తన కొడుకు చనిపోయేందుకు కారణమయిందని కేకే సింగ్ ఆరోపిస్తున్నారు. దీంతో ఈకేసు పురోగతి కోసం బిహార్ పోలీసులు ముంబైకి వెళ్లారు. కాగా, ఇదివరకే సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసును రియ చక్రవర్తి సీబీఐకి అప్పగించాలని కోరడం గమనార్హం.

Next Story