శిల్పా చౌదరి కేసులో మరో ట్విస్టు.. రాధిక స్పెషల్ ఎంట్రీతో సస్పెన్స్

by  |
శిల్పా చౌదరి కేసులో మరో ట్విస్టు.. రాధిక స్పెషల్ ఎంట్రీతో సస్పెన్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : శిల్పా చౌదరి కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రముఖులను అధిక వడ్డీల పేరుతో మోసం చేసినట్టు శిల్పా చౌదరిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. శిల్ప మోసం చేసిన వారి సూపర్ స్టార్ మహేశ్‌బాబు సోదరి, సుధీర్‌బాబు భార్య ప్రియదర్శిని, యువహీరో హర్ష్‌ సహా అనేక మంది సినీ కుటుంబాలు, ఐపీఎస్‌లు ఉండటం విశేషం.

ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు అనుమతితో నార్సింగి పోలీసులు శిల్పాచౌదరిని రెండ్రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించగా కొత్త పేర్లు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో భాగంగా తాను సెలబ్రెటీల వద్ద తీసుకున్న డబ్బును ఆసుపత్రి నిర్మాణానికి ఖర్చు చేశానని శిల్పా చౌదరి తెలిపారు. అలాగే.. రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు ఇద్దరికి పెద్దమొత్తంలో డబ్బు ఇచ్చినట్టు ఆమె కొత్త వ్యక్తులను తెరమీదకు తెచ్చారు. వీరిలో శంకరంపల్లి ప్రాంతానికి చెందిన రాధికకు రూ.6 కోట్లు ఇచ్చినట్టు వెల్లడించారు.

దీంతో పోలీసులు రాధికకు నోటీసులు పంపించారు. సోమవారం విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు.ఇదిలా ఉండగా శనివారం సాయంత్రం మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. శంకరంపల్లి రాధిక మాదాపూర్‌ ఏసీపీని పోలీస్ స్టేషన్‌లో కలిశారు. ఈ సందర్భంగా రాధిక.. తాను శిల్పా చౌదరి వద్ద డబ్బులు తీసుకోలేదని చెప్పారు. అంతేకాకుండా శిల్పా చౌదరినే తన వద్ద డబ్బులు తీసుకొని ఇప్పటి వరకు తిరిగి ఇవ్వలేదని వెల్లడించారు. వారిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాట్, చెక్కుల వ్యవహారాన్ని రాధిక పోలీసులకు అందజేసింది. దీంతో ఈ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ నేపథ్యంలో శిల్ప చెప్పినవన్నీ అబద్ధాలేనా అని పోలీసులు అనుమానిస్తున్నట్టు సమాచారం.

Next Story