- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిన్నటి వరకు ఈ వ్యవహారంలో భూమా అఖిల ప్రియ పేరు ప్రధానంగా వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అఖిల ప్రియను అరెస్ట్ చేసి రిమాండ్కు కూడా పంపారు. అయితే, హఫీజ్పేట భూ వ్యవహారంలో ప్రొడ్యూసర్గా భార్గవ్రామ్, డైరెక్టర్గా ఆయన పీఏ గుంటూరు శ్రీను వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు. అయితే, కిడ్నాప్కు పది రోజుల ముందు నుంచే గుంటూరు శ్రీను… ప్రవీణ్ రావు కదలికలపై రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాయలసీమకు చెందిన పలువురిని పోగు చేసుకొని వారికి కిడ్నాప్ ప్లాన్, సీన్ వివరించాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఫార్మల్ డ్రెస్, షూ, వాచ్, ఐడీ కార్డు, ఫేక్ సెర్చ్ వారెంట్ను కూడా రెడీ చేశాడు. ఇక అదును చూసుకొని రాత్రి సమయంలో ఐటీ అధికారుల దాడులు అంటూ హడావిడి చేస్తూ ప్రవీణ్ రావు ఇంట్లోకి చొరబడ్డారు. ప్రవీణ్ రావును అనుకున్న ప్రకారం కిడ్నాప్ చేసినప్పటికీ.. తరలించే క్రమంలోనే దొరికిపోయిన సంగతి తెలిసిందే.