ఇది రెండవ మరణం

by  |
ఇది రెండవ మరణం
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో కరోనా సోకిన వ్యక్తి మృతిచెందాడు. ఆ రాష్ట్రంలో ఇది రెండవ మరణం. శనివారం ఉదయం మిల్లుపురంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో అతను మృతిచెందాడు. ఈ విషయాన్ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో ధృవీకరించింది. మృతుడి వయస్సు 57 ఏళ్లు అని, అతను మిల్లుపురం నివాసి అని పేర్కొన్నది. ఢిల్లీలో జరిగిన మత సమావేశాల్లో పాల్గొనడంతో అతనికి కరోనా సోకిందని, పాజిటివ్ గా తేలినప్పుట్నుంచి ఆస్పత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నామని, కానీ,.. ఈరోజు ఉదయం అతను మృతిచెందాడని తెలిపింది.

ఇదిలా ఉంటే.. కరోనా సోకి గతనెల 25వ తేదీన మధురైలోని రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకరు మృతిచెందిన విషయం విధితమే.

Tags: villupuram, Tamil Nadu, corona, effect, one person died.

Next Story

Most Viewed