పొగమంచు కారణంగా ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో లారీ.. డ్రైవర్ మృతి

by  |
Road-Accident1
X

దిశ, జనగామ: పొగమంచు కారణంగా రెండు లారీలు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జనగామలోని ప్రగతి ఫార్మసీ కళాశాల వద్ద జాతీయ రహదారిపై పొగమంచు కారణంగా ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీ కొనగా లారీ డ్రైవర్ మృతి చెందాడు. ఇటుక లోడ్ తో వెళ్తున్న లారీ టైర్ పేలడంతో వాహనాన్ని రోడ్డుపై నిలిపివేశారు. దట్టమైన పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story