కరోనా కాటుకు మరో జర్నలిస్టు మృతి..

by  |
కరోనా కాటుకు మరో జర్నలిస్టు మృతి..
X

దిశ, సిర్పూర్ టౌన్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా ఇప్పటికే పలువురు పాత్రికేయులను బలి తీసుకుంది. తాజాగా కరోనా కాటుకు మరో రిపోర్టర్ బలయ్యాడు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్ మండలానికి చెందిన ఓ దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ జునగిరి రమేష్ (38) కరోనాతో పోరాడి తుది శ్వాస విడిచారు.

వివరాల ప్రకారం.. వారం రోజుల క్రితం రమేష్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కాగజ్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో నాలుగు రోజుల క్రితం మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం రమేష్ మృతి చెందారు. అతనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. రమేష్ మృతి పట్ల పెంచికల్‌పేట్ ప్రెస్ క్లబ్ నాయకులు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


Next Story

Most Viewed