షూటింగ్ వరల్డ్ కప్‌లో ఇండియాకు మరో స్వర్ణం

by  |
షూటింగ్ వరల్డ్ కప్‌లో ఇండియాకు మరో స్వర్ణం
X

దిశ, స్పోర్ట్స్: ఢిల్లీలోని డాక్టర్ కర్ణిసింగ్ షూటింగ్ రేంజ్‌లో జరుగుతున్న షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత ఆధిపత్యం కొనసాగుతున్నది. శనివారం విజయ్‌వీర్ సిద్దు, తేజస్విని జోడి 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించారు. ఇండియాకే చెందిన గురుప్రీత్ సింగ్, అశోక్ అభిజ్ఞయ పాటిల్‌పై 9-1 తేడాతో విజయం సాధించి స్వర్ణం కైవసం చేసుకున్నారు. ఇప్పటికే సిద్దు వ్యక్తిగత విభాగంలో వెండి పతకం సాధించాడు. ఆదివారం మరో మూడు ఫైనల్స్ జరుగనున్నాయి. ఇప్పటి వరకు ఇండియా 13 స్వర్ణాలు, 8 వెండి, 6 కాంస్య పతకాలు గెలుచుకొని పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా 53 దేశాలకు చెందిన 294 మంది షూటర్లు ఈ వరల్డ్ కప్‌లో పాల్గొంటున్నారు.

Advertisement
Next Story

Most Viewed