దిశా రవికి ఢిల్లీ కోర్టు షాక్

by  |
దిశా రవికి ఢిల్లీ కోర్టు షాక్
X

న్యూఢిల్లీ: పర్యావరణ కార్యకర్త దిశా రవికి ఇంకో రోజు పోలీసు కస్టడీకి ఢిల్లీ కోర్టు అనుమతించింది. టూల్ కిల్ కేసులో దిశా రవిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆమెకు మూడు రోజుల పోలీసు కస్టడీకి శుక్రవారం కోర్టు ఆదేశించింది. తాజాగా, ఆ కస్టడీ సోమవారంతో ముగియనుండటంతో పోలీసులు దిశారవిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. పోలీసుల అభ్యర్థన మేరకు దిశా రవిని విచారించడానికి మరో రోజు కస్టడీకి అనుమతినిచ్చింది. దిశా రవి బెయిల్ పిటిషన్ శుక్రవారం విచారించి తీర్పు రిజర్వ్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం బెయిల్‌పై తీర్పును వెలువరించనుంది.



Next Story

Most Viewed