తీన్మార్ మల్లన్నపై మరో కేసు

by  |
Teenmar Mallanna
X

దిశ, వెబ్ డెస్క్: తీన్మార్ మల్లన్నపై మరో కేసు నమోదైంది. నిజామాబాద్ జిల్లా నాలుగో ఠాణాలో తీన్మార్ మల్లన్నపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన దగ్గర నుంచి తీన్మార్ మల్లన్న రూ.5 లక్షలు, నిజామాబాద్ కు చెందిన ఉప్పు సంతోష్ రూ.20 లక్షలు డిమాండ్ చేశారంటూ ఓ కల్లు దుకాణం వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో సంతోష్ ను ఏ1గా, మల్లన్నగా ఏ2గా చేర్చారు. ప్రస్తుతం మల్లన్న జైల్లో ఉండటంతో.. సంతోష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మల్లన్న కోసం పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేసే అవకాశముంది.


Next Story

Most Viewed