- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ పెద్దపల్లి : గుంజపడుగు ఎస్బీఐ బ్యాంకు దొంగతనం కేసులో మరో నిందితుడు జహాంగీర్ అలియాస్ మాస్టర్ను అరెస్టు చేసినట్లు రామగుండం కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. నిందితుడి వద్ద నుండి 99.260 గ్రాముల బంగారు ఆభరణాలు రూ.3500 ల నగదుతో పాటు 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం పరుచుకున్నమని వెల్లడించారు. ఇప్పటివరకు ఏడుగురు నిందితులను పట్టుకొని వారి నుండి సుమారు 3.2 కిలోల బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న మిగతా ఇద్దరు దొంగలను త్వరలోనే పట్టుకుంటామన్నారు.
ఈ నిందితునితో పాటు బ్యాంక్ దొంగతనంలో పాల్గొన్న మరో 5 గురు నిందితులను చంద్రపూర్ జైల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంథని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి రిమాండ్ చేశామన్నారు. నిందితునికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి మంథని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి తదుపరి 14 రోజుల జుడీష్యల్ రిమాండ్ కి పంపినట్లు తెలిపారు. నిందితుని నుండి ఇంకా సమాచారం రాబట్టవలసి ఉన్నందున, కోర్టులో కస్టడి పిటిషన్ వేస్తామన్నారు.